గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం125 రోజుల,వికసిత్ భారత్ ఉపాధి హామీ పనులకు ఏటికొప్పాకలో శ్రీకారం...!
02/July/2026 14:50
Share:
అనకాపల్లి జిల్లా, జూలై 2 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ జి-రామ్ జి ఉపాధి హామీ పథకం’ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరుతో కొనసాగిన పనులు ఇకపై ఈ నూతన పేరుతో కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలోని కాలువ ప్రాంతంలో 125 రోజుల ఉపాధి హామీ పనులను కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, కాలువల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న 125 రోజుల ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని, అర్హులైన ప్రతి కార్మికుడు ఉపాధి పనుల్లో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, మాజీ వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, అన్నం స్వరాజ్యరావు, రావి చలపతి, ఎర్రంశెట్టి బాబ్జి, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, బిజెపి శెన్నాంశెట్టి శ్రీను, ఎర్రంశెట్టి కృష్ణ, అన్నం సత్తిబాబు, కలవ మోహన్రావు తదితర కూటమి నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు.