ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
26/June/2026 18:54
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, స్ధానిక జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను గురువారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భధ్రతా ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను పరిశించారు. అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఎప్పటి కప్పుడు గౌడౌన్ క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు పెద్దిబోయిన శివప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పి .వి. వి.ఎస్ ప్రసాద్, వి. స్టాన్లీ బాబు, ఎల్. సుభాష్, రాజనాల రామమోహనరావు, నెరుసు నెలరాజు, ఏ . రతన్ కాంత్, ఆర్. లింగరాజు, డి.ఎన్ .వి.డి. ప్రసాద్, పి . రవికుమార్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.