అనకాపల్లిలో బైక్ దొంగతనం చేసి ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్ వ్యక్తుల అరెస్ట్

అనకాపల్లిలో బైక్ దొంగతనం చేసి ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్ వ్యక్తుల అరెస్ట్

08/June/2026 20:21    Share:   

అనకాపల్లిలో బైక్ దొంగతనం చేసి ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్ వ్యక్తుల అరెస్ట్ – 8 కిలోల గంజాయి, దొంగిలించిన మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కశింకోట పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు.
తేదీ 08-06-2026 న కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-16 పై నూకాంబిక ఫంక్షన్ హాల్ సమీపంలో అందిన విశ్వసనీయ సమాచారంపై స్పందించిన పోలీసులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ స్వామినాయుడు గారి పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ఎస్‌.ఐ శ్రీ సతీష్ గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. లక్ష్మణరావు గారు తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా ఒడిశా రాష్ట్రం నుండి రాజస్థాన్ రాష్ట్రానికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు 8 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 8 కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ మరియు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో అరెస్టు చేయబడిన నిందితుల వివరాలు:
A-1 ఈశ్వర్ గుజ్జర్ S/o ఉదారామ్ గుజ్జర్, 27 సం., డ్రైవర్, రతన్‌పురా గ్రామం, నింబహేరా జాటన్ పోస్టు, రాయ్‌పూర్ తానా, భిల్వారా జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
A-2 మహమ్మద్ సల్మాన్ S/o మహమ్మద్ సలీం, 30 సం., కూలీ, మంగారి మొహల్లా, వార్డు నెం.15, డేలానా (రూరల్), భిల్వారా జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
ప్రాథమిక విచారణలో నిందితులు రాజస్థాన్ రాష్ట్రం నుండి అనకాపల్లికి వచ్చి, జాతీయ రహదారిపై పూడిమడక బ్రిడ్జి సమీపంలో పార్క్ చేసి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసినట్లు వెల్లడైంది. అనంతరం ఆ వాహనాన్ని ఒడిశా రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ గంజాయిని కొనుగోలు చేసి, అదే వాహనంపై అక్రమంగా రాజస్థాన్‌కు తరలిస్తున్న సమయంలో కశింకోట పోలీసులకు చిక్కినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ మేరకు నిందితులపై U/Sec 20(b)(ii)(B) r/w 8(C) NDPS Act-1985 & 303(2) BNS కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఆపరేషన్‌లో డబ్ల్యూ.ఏ.ఎస్‌.ఐ మాణికుమారి, పి.సి రమణ, పి.సి గొర్లె శ్రీనివాసరావు మరియు పి.సి గోపి సమర్థవంతంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోందని, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ కేసును విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి, 8 కిలోల గంజాయి, దొంగిలించిన మోటార్ సైకిల్ మరియు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న సి.ఐ శ్రీ స్వామినాయుడు గారు, ఎస్‌.ఐ శ్రీ సతీష్ గారు, ఎస్‌.ఐ శ్రీ కె. లక్ష్మణరావు గారు మరియు కశింకోట పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter