రోగులకు ఉచిత మందుల పంపిణీ
అనకాపల్లి:
స్థానిక ఏఎంఏవీఎం (AMAVM) రోటరీ కంటి ఆసుపత్రిలో పేదలకు ఉచిత కంటి వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం (30.05.2026) ఆసుపత్రిలో నిర్వహించిన ఓపీకి సుమారు 25 మంది రోగులు హాజరయ్యారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పి. దేవి గారు వీరికి నేత్ర పరీక్షలు నిర్వహించి, వారిలో 7 మందిని ఐఓఎల్ (IOL) ఆపరేషన్లకు ఎంపిక చేశారు.
ఎంపికైన ఆ ఏడుగురు రోగులకు ఆదివారం (31.05.2026) ఉదయం డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు విజయవంతంగా ఉచిత ఐఓఎల్ ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న వారికి రోటరీ సభ్యులు పాలూరి నాగేశ్వరరావు, పి. చిదంబరం గార్ల చేతుల మీదుగా ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
పేదలకు అండగా రోటరీ క్లబ్ చేస్తున్న ఈ సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐ హాస్పిటల్ చైర్మన్ బుద్ధ రమణాజీ, కో-చైర్మన్ కే. సతీష్ సోమసుందర్, సా.నా. త్రినాథ్, మల్ల సూరిబాబు మరియు ఆసుపత్రి సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు.