
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతుల ఉత్పత్తి ఖర్చులకు సరిపోరని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎస్. బ్రహ్మాజీ మాట్లాడుతూ –
పాడి ధాన్యం ధరను 100 కేజీలకు కేవలం ₹70 మాత్రమే పెంచారని, ఇది రైతు ఖర్చులకు సరిపోరని తెలిపారు.
కాంప్లెక్స్ చెరువులో ధరలు 50 కేజీలకు ₹300 పైగా పెరిగాయని, యూరియా అందుబాటులో లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹10 వరకు పెరగడంతో ట్రాక్టర్ ఖర్చు గంటకు ₹200 పెరిగిందని, ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం ఎలా కొనసాగిస్తారో ప్రశ్నించారు.
"అన్నదాత సుఖీభవ" అనే నినాదం వాస్తవంలో రైతులకు ఉపశమనం ఇవ్వడం లేదని విమర్శించారు.
ఈ నిరసనలో రైతు నాయకులు అర్జున నాగేశ్వరరావు, సన్యాసిరావు, శరణం రామనాయుడు, కర్రీ కృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.