ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతుల ధర్నా..

ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతుల ధర్నా..

11/March/2026 19:33    Share:   

ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతుల ధర్నా.. ఉద్యాన శాఖ కార్యాలయం వరకు ర్యాలీ..
కోకో గింజలు ధర తగ్గింపుపై కోకో కాయలతో నిరసన..కంపెనీలు, ప్రభుత్వ తీరుపై కోకో రైతుల ఆగ్రహం..కోకో గింజలకు ప్రైస్ పాలసీ- ప్రైస్ ఫార్ములా- ప్రైస్ నిర్ణయం వెంటనే ప్రకటించాలి.. విదేశీ కోకో గింజలదిగుమతులు నిలుపుదల చేయాలి.. రైతులు వద్దనున్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలి.. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్.. ఏలూరు మార్చి 11: కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు.ఆయిల్ పామ్ గెలలకు మాదిరిగా కోకో గింజలకు ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా కోకో గింజల  ధర తగ్గించివేయడం పట్ల కోకో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలు, ప్రభుత్వ తీరుపై కోకో కాయలతో నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ నుండి ఉద్యాన శాఖ జిల్లా అధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని, విదేశీ కోకో గింజలు, కోకో ఉత్పత్తుల దిగుమతులు అరికట్టాలని, కోకో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఆయిల్ పామ్ గెలల మాదిరిగా కోకో గింజలకు ప్రైస్ పాలసీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారూ ఈ ఏడాది నుండి ధర పాలసీ ప్రకటించి ఫార్ములా రూపొందించి ధర నిర్ణయిస్తామని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ హామీని వెంటనే అమలు చేయాలన్నారు. హామీ ఇవ్వడం జరిగింది. ప్రైస్ పాలసీ లేకపోవడంతో రైతుల నుండి సక్రమంగా కోకో గింజలు కంపెనీలు కొనుగోలు చేయడం లేదన్నారు. రైతుల వద్ద వందల టన్నుల కోకో గింజలు నిల్వ ఉన్నాయని, ఈ కోకో గింజలు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, జిల్లా ఉద్యాన అధికారి షాజా నాయక్ లకు కోకో రేతులు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాలు అందజేశారు.
Breaking News

Subscribe our Newsletter