కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ యలమంచిలి మున్సిపాలిటీలో బుధవారం అనుమతి జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆంజనేయస్వామి నామస్మరణ, జైశ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలను మారుమ్రోగించారు.పలు చోట్ల భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పరమట గెడ్డ వద్ద పండితులు కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ, గరిమెళ్ళ చంద్రశేఖర్ శర్మ, ఆధ్వర్యంలో గణపతి పూజ, స్వామివారికి పంచామృత అభిషేకం మరియు అష్టోత్తర సింధూరం పూజ, మన్య సూక్త హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త ఆడారి ఆదిమూర్తి ఆధ్వర్యంలోభారీ అన్న ప్రసాదాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా యలమంచిలి ధర్మవరంలో వేంచేసి ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. టిడ్కో కాలనీలో ఉన్న స్వామివారి వద్ద, ఆర్.టీ.సి.కాంప్లెక్స్ వద్ద హనుమాన్ ఆలయం, ఇదేవిధంగా యలమంచిలి మెయిన్ రోడ్డుపై ద్వారకా నగర్, కొత్తపాలెం అభయ ఆంజనేయస్వామి, సోమలింగపాలెం, తేరువుపల్లి మండలంలో పలుచోట్ల హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.