ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా  పి. జగదాంబ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా పి. జగదాంబ

03/April/2026 07:23    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
ఈ రోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా (CEO) బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ,జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పి. జగదాంబ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి,జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా,పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్య, వైద్య ఆరోగ్య రంగాలలో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరాన్ని వివరించారు.అదేవిధంగా, జిల్లాలో వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, ప్రణాళికాబద్ధంగా పనులను ముందుకు తీసుకువెళ్లాలని, ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని చైర్‌పర్సన్ గారు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా పి. జగదాంబ గారు మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో అమలవుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని, అధికారులతో సమన్వయంగా పని చేస్తూ ప్రభుత్వం లక్ష్యాలను చేరుకునే దిశగా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
Breaking News

Subscribe our Newsletter