“ఆపరేషన్ దండాయన”తో నేరగాళ్లపై ఉక్కుపాదం అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.
29/May/2026 21:20
Share:
మహిళలు, బాలికల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత: అనకాపల్లి, మే 29: ఆంధ్రప్రదేశ్లో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారిపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు.రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మహిళా & శిశు భద్రత విభాగం ఐజీ శ్రీమతి రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో... ఏపీ పోలీస్ శాఖ “స్పీడ్ ట్రయల్ మానిటరింగ్” (Speed Trial Monitoring) విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే నేరాల నియంత్రణకు, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడానికి ప్రతిష్టాత్మక “ఆపరేషన్ దండాయన” ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.“ఆపరేషన్ దండాయన” ప్రధాన లక్ష్యాలు & పోలీస్ అధికారులకు ఆదేశాలు: జీరో టాలరెన్స్ & సత్వర విచారణ: మహిళలపై జరిగే నేరాల విషయంలో 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబించడం. 60 రోజుల్లో చార్జిషీట్: ప్రతి కేసులోనూ నిందితులపై 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి, నిందితులకు వేగంగా కఠిన శిక్షలు పడేలా చూడాలి.SOS నిఘా: పునరావృత నేరస్తులు, అనుమానితుల కదలికలపై SOS (సెక్సువల్ అఫెండర్ సర్వలెన్స్ షీట్స్) ద్వారా నిరంతర నిఘా ఉంచాలి. బాధితులకు భరోసా: బాధిత మహిళలకు అవసరమైన కౌన్సిలింగ్, ఉచిత న్యాయ సహాయం అందించాలి.పెండింగ్ కేసుల పరిష్కారం: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పునఃసమీక్షించి, ప్రాధాన్యత క్రమంలో చార్జిషీట్లు దాఖలు చేయాలి.సైబర్ వాచ్ & ఇంటెలిజెన్స్: ప్రజా భాగస్వామ్యంతో “సైబర్ వాచ్” కార్యక్రమాన్ని అమలు చేస్తూ, ఇంటెలిజెన్స్ నిఘాను పెంచాలి. అవగాహన & పరివర్తన: సామాజిక కార్యకర్తలతో కలిసి “పరివర్తన సదస్సులు” నిర్వహించాలి. మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. చట్టాలపై భయం కలిగేలా ఇటీవల కోర్టులు ఇచ్చిన తీర్పులను పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం చేయాలి. అనకాపల్లి జిల్లాలో శిక్షల (Convictions) వివరాలు (2024 - 2026): మహిళలపై జరిగిన నేరాలలో (Crime Against Women) అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ పక్కా ఆధారాలతో కోర్టుల ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేసింది. అలాగే జిల్లాలో SOS (సెక్సువల్ అఫెండర్ సర్వలెన్స్ షీట్స్) 137 మంది పై షీట్స్ తెరిచి, వారిపై పూర్తి నిఘా ఉంచడం జరిగింది. మహిళలపై నేరాలలో (క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్) 2024 (10 కేసులు), 2025 (15 కేసులు), 2026 (03 కేసులు) మొత్తం 28 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కన్విక్షన్ (శిక్షలు) పడేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. "మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ మరియు Conviction Based Policing విధానంతో ముందుకు వెళ్తున్నాం. నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా సరే, చట్టం ముందు మోకరిల్లాల్సిందే. ప్రతి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు ‘ఆపరేషన్ దండాయన’ నిరంతరం కొనసాగుతుంది. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు..