మహారాష్ట్రలో కురుస్తున్న రాత్రింబవళ్ల భారీ వర్షాలు తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల రాష్ట్రంలోని ప్రధాన నగరాలు జలమయమయ్యాయి.
పుణే నగరంలో వరద ఉధృతికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.నివాస ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లింది.సహాయక చర్యల కోసం స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది.
ముంబై నగరంలో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాల వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా నెమ్మదించింది.ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి.లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.